ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోడీ పర్యటనలో భద్రతావైఫల్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 01:48 PM

ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో సోమవారం భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. గన్నవరం ఎయిర్‌పోర్టులో మోడీ హెలికాప్టర్‌ ఎక్కి, భీమవరం చేరుకున్నారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్టుకు 2 కి.మీ. దూరంలో కేసరపల్లి గ్రామంలో కొందరు నల్ల బెలూన్లను భారీగా వదిలారు. అవి హెలికాప్టర్‌కు అత్యంత సమీపంగా వెళ్లడం ఆందోళన కలిగించింది. విభజన హామీలు అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తరహా నిరసన చేపట్టినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa