తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు వింత అనుభవం ఎదురైంది. నాగపడగల కొరతతో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. ఇదిలావుంటే రాహుకేతు పూజలకు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా ఈ పూజల కోసం ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. నాగపడగల కొరత కారణంగా రాహు కేతు పూజలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.రాహుకేతు పూజల నిమిత్తం తమ వంతు కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు చివరికి అసలు విషయం తెలుసుకొని ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రోజు రాహు కాలంలో దోష నివారణ పూజ చేయించుకునేందుకు శ్రీకాళహస్తి వచ్చానని.. నాగ పడగలు లేని కారణంగా ఆ సమయానికి పూజ చేయించుకోలేకపోయానని ఓ భక్తుడు వాపోయారు. సకాలంలో పూజలు చేయించకపోవడంతో స్వగ్రామానికి వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్న ట్రైన్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని మరి కొంత మంది భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాహు కేతు పూజల కోసం ఓ వైపు తాము గంటలు తరబడి క్యూలైన్లో వేచి ఉంటే.. మరోవైపు ఆలయ సిబ్బంది కొంత మంది కొందరు భక్తులను అడ్డదారుల్లో తీసుకెళ్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa