ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ఎంపీల్లో సైలెంట్ గా ఉండేది ఎవరు అంటే.ముందుగా చెప్పే పేరు ఏలూరు ఎంపీదే.. ఆయనే కోటగిరి శ్రీధర్ బాబు .. మొన్నటి వరకు ఆయన పేరే ఎక్కడ వినిపించేది కాదు.. కానీ గత రెండు రోజుల నుంచి ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు. అందుకు కారణం ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలే... అల్లూరి సీతరామరాజు విగ్రహ ఆవిష్కరణ కోసం భీమవరం వచ్చారు ప్రధాని మోదీ . ఆ పర్యటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినా ఆయన.. ఇలా వార్తల్లో నిలుస్తున్నారు. మరోసారి ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం సీఎం జగన్మోహన్ రె డ్డికి ఉందని అన్నారు. భవిష్యత్తులో ఆయన కచ్చితంగా ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. అక్కడితో శ్రీధర్ బాబు ఆగలేదు.. వచ్చేఎన్నికల్లో జాతీయ స్థాయిలో.. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి భారీగా సీట్లు తగ్గుతాయి అన్నారు.. అదే సమయంలో ప్రస్తుతం ఉన్నవాటికంటే వైసీపీకి సీట్లు పెరుగుతాయని.. అందుకే ప్రత్యేక హోదా తప్పక తీసుకొస్తామనే నమ్మకం తన అధినేతకు ఉంది అన్నారు.
ఏలూరులో జిల్లా ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు టీడీపీపై కోపంతో వైసీపీకి ఓట్లేశారని, కానీ ఇప్పుడు టీడీపీపై కోపంతో కాకుండా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీపైన, సీఎం జగన్ పైనా ప్రేమాభిమానాలతో ఓటు వేయబోతున్నారని అన్నారు. గతంలో కంటే ఈ సారి భారీగా ఓట్లు పడతాయని.. రాష్ట వ్యాప్తంగా వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే ఈ సారి సీట్ల సంఖ్య పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ గెలుపుకోసం పనిచేసే కార్యకర్తలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేశారని, ఇంకా వారికి ప్రభుత్వం నుంచి బిల్లు రాకపోయినా బాధపడటం లేదన్నారు. అయితే జగన్ పైనా.. పార్టీపై ఉన్న అభిమానంతో పని చేసేందుకు మరింత ఉత్సాహంతో ముందుకు సాగటం సంతోషంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని అన్నారు.
జనసేన కాదు ధనసేన.. పవన్ రాజకీయ నాయకుడు కాదు.. ఆప్షనల్ పొలిటీషియన్ కొల్లేరు అభివృద్ధికి త్వరలో ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారని, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు. సాధారణంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యల జోలికి కానీ, ఇతర పార్టీలపై విమర్శలకు కానీ దూరంగా ఉండే శ్రీధర్ బా బు తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa