తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు పులపర్తి నారాయణమూర్తి ఆకస్మిక మరణం పొందినట్లు టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయన మృతి పట్ల విచారకరం వ్యక్తపరిచారు. పార్టీ కోసం ప్రతి నిత్యం కృషి చేసిన.. నారాయణమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలానే ఆయన చేసిన సేవలు పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు. తమ స్థాయిలో పార్టీని కట్టుదిట్టం చేసి ముందుకు నడిపారన్నారు. ఏది ఏమైనా ఆయన లేని లోటు తీర్చలేనిదని , వారి కుటుంబానికి టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa