కాచిగూడ-తిరుపతి-కాచిగూడ (07297, 07298) మధ్య ప్రయాణికుల కోసం ఈనెలలో ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ నెల 7, 14, 21వ తేదీల్లో తిరుపతి నుంచి కాచిగూడకు, 13, 20 తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతి వరకు ఈ రైలు నడవనుంది. తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రేణిగుంట మీదుగా రాజంపేటకు సాయంత్రం 4. 20, కడపకు 5. 05 గంటలకు, కాచిగూడకు తెల్లవారుజామున 4. 00 గంటలకు చేరనుంది.
కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లే రైలు కాచిగూడలో రాత్రి 10. 20 గంటలకు బయలుదేరి ఎర్రగుంట్లకు మరుసటిరోజు ఉదయం 6. 35 గంటలకు, కడపకు 7. 30, రాజంపేటకు 8. 15, తిరుపతికి ఉదయం 11 గంటలకు చేరనుంది. ఈ అవ కాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కడప రైల్వే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టరు ఉమ్మర్ భాష, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టరు యానాదయ్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa