ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద నీటిలో సీఎం ఏక్ నాథ్ షిండే నివాసం

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 03:13 AM

భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమైంది. ఎక్కడ చూసిన నీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాజధాని ముంబై సహా థానే, పాల్ఘర్ తదితర జిల్లాలు కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో థానేలోని సీఎం ఏక్ నాథ్ షిండే నివాసం వరదనీటిలో చిక్కుకుపోయింది. నివాసం చుట్టూ వరదనీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుని వరదనీటిని తొలగించింది. 


మరోవైపు పూణె, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకోవైపు కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని పంజికల్ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఉడుపి, బెళగావి, దక్షిణ కన్నడ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa