వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో దూకుడు పెంచుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రశంసలతో ముంచ్చెత్తుతున్నారు. మీ స్పీడు ఇలాగే కొనసాగించండి అని వారు పవన్ కళ్యాణ్ ను కోరుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ను టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కార్టూన్లతో సెటైర్లు పేలుస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పవర్ పంచ్ విసిరారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదనే అంశంపై ఓ కార్టూన్ను జనసేనాని ట్వీట్ చేశారు. ‘డిగ్రీ, పీజీ కూడా చేశాను. ఏదైనా జాబ్ ఇమ్మంటే ఇదిచ్చి పోయాడు’ అంటూ ఒక నిరుద్యోగి తన చేతిలో జాబ్ క్యాలెండర్ చూపిస్తున్నట్లు కార్టూన్లో ఉంది. అాలగే పట్టభద్రులు పకోడీలు, పండ్లు అమ్ముకుంటున్నట్లు.. ఆ పక్కనే సీఎం సెక్యూరిటీతో వెళ్తున్నట్లు.. ఆయనను ఉద్దేశించి నిరుద్యోగి వ్యాఖ్యానించినట్లుగా కార్టూన్లో చూపించారు.
నిరుద్యోగ సమస్యే కాదు మద్య నిషేధంపైనా మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కార్టూన్ ట్వీట్ చేశారు. మద్య నిషేధం చేస్తామన్నారు కదా అటూ ఓ మహిళ ప్రశ్నిస్తుంటే.. నిషేధించాం కదా.. మీ ఇల్లు గుల్ల చేస్తారని ఖరీదైన మద్యం దొరక్కుండా చేశాం కదా అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నట్లుగా కార్టూన్ను ట్వీట్ చేశారు. అలాగే జగన్ విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్లాలన్నా హెలికాప్టర్లో వెళతారని.. జనాలకేమో బస్సులు కూడా లేవని సెటైర్లు పేల్చారు. ఇలా వరుసగా ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. పవన్ దూకుడు చూసి జనసైనికులు, అభిమానులు ఇదే స్పీడులో ఉండాలని అధినేతను ఆకాశానికి ఎత్తేస్తుననారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa