ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.15 మేర తగ్గించాల్సిందే...అయిల్ కంపెనీలకు కేంద్రం హుకుం

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 09:47 PM

కొండెక్కిన వంటనూనె ధరలను కిందికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం భిగించింది. వంటనూనెల ధరలను లీటరుపై రూ.15ను తక్షణమే తగ్గించాలని ట్రేడ్ బాడీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోవడంతో.. దేశీయంగా కూడా వెంటనే ధరలను తగ్గించాలని ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోనే భారత్ వంటనూనెలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తగ్గిన ధరల ప్రయోజనాలను ట్రేడ్ బాడీలు, తుది వినియోగదారునికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


భారత్ ప్రధానంగా తనకు కావాల్సిన పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ నుంచి కొనుగోలు చేస్తోంది. సోయా ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతేకాక సన్‌ఫ్లవర్ ఆయిల్‌ కోసం ఉక్రెయిన్, రష్యాలపై ఆధారపడుతోంది. ఇలా వంటనూనెల కోసం భారత్ పలు దేశాలపై ఆధారపడుతూ దేశీయ అవసరాలను తీరుస్తోంది.


రెండు రోజుల క్రితమే ఫుడ్ సెక్రటరీ సుధాన్ష్ పాండేతో వంటనూనెల అసోసియేషన్లు, తయారీదారులు సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తగా ధరలు తగ్గడంతో.. వాటిని వినియోగదారులకు బదలాయించే విషయంపై చర్చలు జరిపారు. ఆ మీటింగ్‌లో కూడా తయారీదారులు, రిఫైనరీలు తక్షణమే ధరలను తగ్గించాలని కేంద్రం కోరింది. నేడు ట్రేడ్ బాడీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే లీటరుపై రూ.15 మేర ధరలు తగ్గించాలని ఆదేశించింది. కొన్ని కంపెనీలు ధరలు తగ్గించడం లేదని, ఇతర బ్రాండులతో పోలిస్తే వారి ఎంఆర్‌పీలు అత్యధికంగా ఉంటున్నాయని వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ధరలను తగ్గించాలని మంత్రిత్వ శాఖ కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa