ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుబేర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 09:53 PM

 


కొంత చేదు..మరికొంత ఊరాట నిచ్చేలా జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబేర్‌ విషయంలో కోర్టు తీర్పు నిచ్చింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ నమోదైన కేసులోజుబేర్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలిచ్చింది. అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది.


తమ విశ్వాసాన్ని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా.. అభ్యంతకరమైన పదాలతో ట్వీట్ చేశారనే ఫిర్యాదుతో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు జుబేర్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు తనపై సీతాపూర్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని జుబేర్‌ను కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే ఆ కేసులో జుబేర్ బెయిల్ పిటిష‌న్‌ను సీతాపూర్ కోర్టు తిరస్కరించింది.


దాంతో జుబేర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జుబేర్‌కు ప్రాణ హాని ఉందని, ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని జుబేర్‌ తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జుబేర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. అయితే ఆ కాలంలో జుబేర్ ఎలాంటి ట్వీట్‌లు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేయకూడదని కోర్టు సూచించింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులను సోమవారం వరకు నిలిపివేయాలని యూపీ పోలీసులు తరఫున లాయర్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.


నిజానికి జుబేర్‌ నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్‌పై ఇప్పుడు దుమారం రేగింది. ఆ ట్వీట్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని, రెచ్చగొట్టేవిధంగా ఉందని కేసు నమోదు అయింది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 153, సెక్షన్ 295ఏ, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 తదితర కేసులు పెట్టారు. ఈ మేరకు అతనిని జూన్ 27న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత జుబేర్‌ను యూపీలోని సీతాపూర్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa