భారీ వర్షాల నేపథ్యంలో ఏపీసర్కార్ అప్రమత్తమైంది. అత్యవసర సర్వీసుల కోసం కంట్రోల్ రూంను ప్రారంభించింది. ఇదిలావుంటే నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు వానలు కురుస్తున్నాయి. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులను ఈ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. వర్షాకాలం రావడంతో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు అప్రమత్తమైంది. జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రజలు వారి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించింది. 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 1070, 18004250101, 08632377118కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa