ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఘటనలో...బాబాయి...అబ్బాయిపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 02:02 PM

టీడీపీకి చెందిన బాబాయి. అబ్బాయిపై కేసు నమోదు అయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , ఎంపీ రామ్మోహన్ నాయుడులపై కేసు నమోదైంది. ఇద్దరితో పాటూ టీడీపీ నేతలపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తితిలీ తుఫాన్ పరిహారంలో జరిగిన అవకతవకలపై ఈ నెల 8న కలెక్టర్‎కు వినతిపత్రం అందజేశారు. అయితే ఈ సమయంలో టీడీపీ నేతలను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.


అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడులు తితిలీ బాధితుల్ని ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత హైటెన్షన్ వాతావరణం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తోందని, సిగ్గు, ఎగ్గూ లేకుండా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. రైతు దినోత్సవం కంటే రైతు దగా దినోత్సవంగా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. తితిలీ తుఫాన్‌లో నాలుగు మండలాలు విధ్వంసం అయ్యాయని.. అప్పట్లో చంద్రబాబు బాధితులకు యుద్ధ ప్రాతిపదికన పరిహారం అందించారన్నారు. కానీ ఆ రోజు జగన్ పక్క జిల్లాలో క్యాట్ వాక్ చేశారని సెటైర్లు పేల్చారు.


జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తితిలీ బాధితులకు పరిహారం డబుల్ ఇస్తామన్నారని.. కానీ పరిహారం వైఎస్సార్‌సీపీ చెందిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సానుభూతి పరులను జాబితా నుంచి తప్పిస్తున్నారని.. అవసరమైతే కోర్టుకు వెళ్లి పరిహారం ఇప్పిస్తామన్నారు. రైతులను దగా చేసినందుకు ఉత్సవాలా అంటూ ప్రశ్నించారు. రైతు దినోత్సవం ఏమి చేశారని నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు.. రైతు అమ్ముకున్న పంటకు డబ్బు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa