ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక, ఆర్థిక అసమానతలపై వై.ఎస్.జగన్ యజ్ణం: మంత్రి సీదిరి అప్పలరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 02:03 PM

రాష్ట్రంలో సామాజిక ఆర్ధిక అసమానతలను తొలగించి సమతుల్యత సాధించేందుకు సీఎం జగన్ ఓ యజ్ణాన్ని చేపట్టారన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఆ యజ్ణం కొనసాగుతొందని.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వర్గానికి మాత్రమే కొమ్ముకాసిందన్నారు. ప్లీనరీకీ జనం ఒక సునామిలా వచ్చారని.. దానిని చూసి టీడీపీకి పిచ్చిపట్టి ఎవేవో మసాలాలు జోడించి మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాష్ట్రంలోని రైతు సమస్యలపై కనీస అవగాహాన లేదన్నారు. రైతు కుటుంబం చనిపోతే రూ.7లక్షలు వెంటనే ఇస్తున్నామన్నారు. తాము రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ఒక్క కుటుంభాన్ని చూపండి ఛాలెంజ్ చేస్తున్నానన్నారు.


వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడం తమకు భాదాకరమైనప్పటికి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని క్లియర్‌గా చెప్పారన్నారు సీదిరి అప్పలరాజు. తాము వైసీపీని, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను వేరువేరుగా చూడటం లేదన్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి విజమమ్మ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దీనిని పార్టీ శ్రేణులకు భాదాకరమైనా జీర్ణించుకోలేక తప్పలేదన్నారు. అధికారం ఉండికూడా ప్లీనరీ పెట్టుకోలేక పోతున్నారని నిన్నటి వరకు టీడీపీ వారు అన్నారని.. ప్లీనరీ పెట్టిన తరువాత మాత్రం అదేంటి ఇప్పుడు పెట్టారు అని మాట్లాడుతారని మండిపడ్డారు. అసలు ప్లీనరీ గురించి మాట్లాడటానికి టీడీపీ వాళ్లు ఎవరని ప్రశ్నించారు.


ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబమైనా తమకు ఎక్స్‌గ్రేషియా అందలేదని ఫిర్యాదు ఎక్కడైనా చేశారేమో చెప్పాలన్నారు. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించని వాటిని వేలసంఖ్యల్లో చూపిస్తామన్నారు. ప్రచారం కోసం నాజకీయాలకోసం ఇటువంటి డ్రామాలు వేయడం.. సాధారణంగా వాటికి విలువ ఉండదన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చేసే ఇటువంటి వాటిని డ్రామాలుగానే చూడాలి.. సినిమాలను చూసినట్లు వీటిని కూడా చూసి ఎంటర్ టైన్ మెంట్ చేయాలి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa