ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ విశాఖపట్నం పర్యటన వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 09:06 PM

భారీ వర్షాల కారణంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం అందిస్తున్న వాహన మిత్ర నిధులను విడుదల చేసేందుకు ఈ నెల 13న విశాఖపట్నంలో పర్యటించాలని జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ప్రకటించింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa