తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్నిఘనంగా నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొని ఆలయ సంప్రోక్షణ చేశారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.
శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa