భారీ వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైల్వే ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సోమవారం రైల్ నిలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో పాటు విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజినల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. భారీ వర్షాల సమయంలో ట్రాక్ నిర్వహణకు సంబంధించి కచ్చితంగా తనిఖీలు చేపట్టాలని జీఎం సూచించారు. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు ఉంటే ప్రయాణీకులకు సమాచారాన్ని చేరవేయాలన్నారు.
దీంతో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు నీట మునగడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 11 నుంచి 13 వరకు కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైలు, విజయవాడ- బిట్రగుంట మెము రైలు, సికింద్రాబాద్- మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్- ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్-ఉందానగర్ మెము రైలు, మేడ్చల్-ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, ఉందానగర్-సికింద్రాబాద్-ఉందానగర్ మెము స్పెషల్ రైల్, హెచ్.ఎస్ నాందేడ్- మేడ్చల్-హెచ్ఎస్ నాందేడ్ రైలును రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 11-13 తేదీల మధ్య 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి - హైదరాబాద్ రూట్లో 9 సర్వీసులు, హైదరాబాగ్ - లింగంపల్లి మార్గంలో 9, ఫలక్నుమా - లింగంపల్లి రూట్లో 7, లింగంపల్లి -ఫలక్నుమా మార్గంలో 7, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్లో ఒకటి, లింగంపల్లి సికింద్రాబాద్ మార్గంలో ఒక సర్వీసు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa