తనను నమ్ముకొన్న ఓ కార్యకర్త చనిపోతే అతని పాడే మోసి ఘననివాళ్లులర్పించారు ఏపీ మంత్రి. వైసీపీ కార్యకర్త, తన అనుచరుడి పాడె మోశారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పశ్చిమ గోదావరి తణుకు మండలం దువ్వలో కడియం శ్రీనివాస్ వైసీపీ కార్యకర్త.. పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు, మాజీ ఎంపీటీసీ కూడా. ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో మంత్రి నాగేశ్వరరావు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లారు. మంత్రి కార్యకర్త కుటుంబసభ్యుల్ని పరామర్శించి.. శ్రీనుకు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అంతిమ యాత్రలో శ్రీను పాడే మోశారు. స్వయంగా మంత్రి రావడం.. పాడె మోయడంతో పార్టీ కార్యకర్తలపై ఆయనకున్న నిబద్దత అంటూ పలువురు స్థానికులు అభినందించారు. కారుమూరి నాగేశ్వరరావు ను అభినందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa