విజయవాడ స్థానిక 48వ డివిజన్ లోని 154వ సచివాలయం పరిధిలో 46వ రోజు శుక్రవారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని కటీకల మస్తాన్ వీధి, ఉర్దూ స్కూల్ రోడ్, ఈద్గా మహల్ రోడ్, పిళ్ల చిట్టయ్య వీధి మరియు తదితర ప్రాంతాలలో పర్యటించారు.
గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొండా ప్రాంతా మంచినీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తాంఅని, వాహన మిత్ర పథకం ద్వారా జగనన్న వాహన కార్మిక సోదరులను ఆదుకోవడం జరుగుతుందని, నేడు వాహన మిత్ర లబ్దిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa