బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కేంద్రంలో రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మహంతి ధనుంజయ అన్నారు. ఈ సందర్బంగా జనసైనికులు సాలూరు రామభద్రపురం సెంటర్ లో నిరసన తెలిపారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నేటి నుంచి మూడురోజులు మండలంలో అన్ని గ్రామాల్లో పర్యటించి, రోడ్డు పై గుంతలు ఫోటోలు తీసి సీఎంని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని తెలిపారు.
కార్యక్రమం లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మహంతి ధనుంజయ కోరారు, ముళ్ళు గణపతి, ముల్లి వెంకటనాయుడు, పప్పల అప్పలనాయుడు, ముళ్ళు కిషోర్, యాళ్ల మణి, బెల్లన సాయి మరియు మండల జనసైనికులందరు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa