ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబీ జిల్లాలోని పురా గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. వ్యవసాయం చేసే అశోక్ కి మూడేళ్ల కింద సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్ వచ్చింది. అప్పటి నుంచి కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నాడు. అయితే తాజాగా అతడికి రూ.8,700 కరెంటు బిల్లు వచ్చింది.
దీంతో అశోక్ మానసిక పరిస్థితి దిగజారిపోయిందని అశోక్ భార్య మోహని దేవి తెలిపారు. ఈ క్రమంలోనే అశోక్ హై వోల్టేజ్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విద్యుత్ తీగలపై పాకుతూ ముందుకు వెళ్లాడు. ఆ సమయంతో కరెంటు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అశోక్ ని కిందకు దించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa