రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బలహీన వర్గాల ఆరాధ్య దైవమనిస్థానిక నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పేర్కొన్నారు. శాసన సభ్యురాలు రెడ్డి శాంతి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని సమస్యలతో పాటు వంశధార నిర్వాసితులకు అందజేస్తున్న అదనపు పరిహారం పంపిణీ గూర్చి ముఖ్యమంత్రివై. ఎస్ జగన్మోహన్ రెడ్డితో రెడ్డి శాంతితో చర్చించారు. ఇప్పటివరకు దాదాపుగా 60 శాతం పై బడి షుమారుగా 160 కోట్లు రూపాయలు అర్హులైన వంశధార నిర్వాసితుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో నేరుగా అదనపు పరిహారం జమ అవుతుందని శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, ముఖ్యమంత్రి వై. యస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa