ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే గొప్ప అవకాశాన్ని వైసీపీ సర్కార్ కోల్పోయిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అంటూ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సింహగడ్ కోటస్వాధీనం తరువాత,శివాజీ "కోటను పొందాము, కానీ సింహంతానాజీ మాలుసరేను కోల్పోయాము) అన్నారు. మన ప్రజాప్రతినిధుల పూర్తి విధేయత ఎన్డీయేరాష్ట్రపతి అభ్యర్థికి విజయాన్ని తెచ్చిపెట్టింది. కానీ పెండింగ్లో ఉన్న డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చే గొప్ప అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది’ అంటూ వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు.
2012 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో రెండు పార్టీల తీరును గుర్తు చేశారు. పీ.ఏ. సంగ్మా (ఎస్టీ) పోటీ చేస్తే.. నాడు వైఎస్సార్సీపీ యూపీఏ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తే, టీడీపీ దూరం ఉందని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అపుడేమైందని ప్రశ్నించారు.. సామాజిక న్యాయం పేరిట రాజకీయ నాటకం ఆడే కన్నా, రాష్ట్ర న్యాయం, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికలలో ఓటువేయాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించడానికి వైసీపీ, టీడీపీకి రాష్ట్రపతి ఎన్నికలే సరైన అవకాశంగా వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానాలు, రాజీనామాలు, ఎన్డిఎ నుంచి వైదొలగడం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేసిన తర్వాతే ఓటు వేయాలి అని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు, ఫలితాల తర్వాత కూడా మళ్లీ టార్గెట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa