ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పథకాలు ఎవరికైనా అందలేదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 01:20 PM

ప్ర‌జా సంక్షేమ‌మే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అనంతపురం  ఎమ్మెల్యే జొన్న‌లగ‌డ్డ ప‌ద్మావ‌తి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం, సంజీవపురం  గ్రామంలో ఎమ్మెల్యే గ‌డ‌ప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పథకాలు ఎవరికైనా అందలేదా? అని ఆరాతీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు . రాష్ట్రంలో ఒకప్పుడు వృద్ధులు పెన్షన్ అందుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు పడే వారు, కానీ నేడు ప్రతినెలా ఇంటింటికీ వచ్చి పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మ‌న‌దే అన్నారు.  ఇదే గ్రామానికి చెందిన భీమిరెడ్డి మురళీమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే పద్మావతి.. ఆయన పేరు మీద ముఖ్యమంత్రి జగనన్న రాసిన లేఖను చూపించారు. అందులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో  త‌న‌కు అందించిన ల‌బ్ధిని వివ‌రించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa