ఉద్యోగుల అకౌంట్ల నుంచి సొమ్ము ఉపసంహరణకు ఎలాంటి అనుమతి అవసరం లేదని.. తిరిగి వాటిని వారి ఖాతాల్లో జమ చేసేందుకు బడ్జెట్ మంజూరు కావాలా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగుల అకౌంట్ల నుంచి దాదాపు రూ.2,200 కోట్ల వరకు ఉపసంహరించారని..వేరే అవసరాల కోసం వాటిని వినియోగించి, అవసరం తీరాక ప్రస్తుతం తిరిగి వాటిని జమచేస్తామని చెబుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును రాష్ట్రప్రభుత్వం వాడుకోవడంపై ఇలా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పీఆర్సీకి సంబంధించి ఈ ఏడాది జనవరి 17న ప్రభుత్వం జారీచేసిన జీవో1ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ జరిపి.. వేతన సవరణ ఉత్తర్వుల ఆధారంగా ఏ ఉద్యోగి జీతంలోనూ రికవరీ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ శుక్రవారం పిటిషన్పై మరోసారి విచారణ జరిగింది. డబ్బులు ఉపసంహరణ విషయంలో పిటిషనర్కు ముందుగా ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని లాయర్ వాదనలు వినిపించారు. జీపీఎఫ్ అకౌంట్ నుంచి సొమ్మును లేకపోవడంతో పిటిషనర్ మొదట ఆందోళన చెందారని.. ప్రభుత్వమే సొమ్మును ఉపసంహరించినట్లు తర్వాత తెలుసుకున్నారన్నారు.
పిటిషనర్ అకౌంట్ నుంచి రూ.91,226 మొత్తాన్ని ఉపసంహరించారని.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి డబ్బుల్ని తీసుకున్నారన్నారు. సాంకేతిక కారణాలవల్లే ఉద్యోగుల అకౌంట్లలో సొమ్ము ఉపసంహణ జరిగిందని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పీఆర్సీకి, సొమ్ము ఉపసంహరణకు సంబంధం లేదన్నారు. బడ్జెట్ మంజూరు అయిన వెంటనే సొమ్మును తిరిగి వారి అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలు వివరించేందుకు ఏజీ ప్రయత్నించగా.. పిటిషనర్ తరఫున లాయర్ కౌంటర్ ఇచ్చారు. తీవ్రమైన కేసులో అడిషనల్ సెక్రటరీతో అఫిడవిట్ వేయించడం సరికాదన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అందుబాటులో లేకపోవడంవల్లే అడిషనల్ సెక్రటరీతో అఫిడవిట్ వేయించాల్సి వచ్చిందని ఏజీ అన్నారు. ఇక పై ముఖ్యకార్యదర్శి అఫిడవిట్ వేస్తారన్నారు.
ప్రభుత్వం చెప్పే వివరాలు కాగ్కి కూడా అర్థం కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగుల అకౌంట్ల నుంచి సొమ్ము ఉపసంహరణకు ఎలాంటి అనుమతి అవసరం లేదని.. తిరిగి వాటిని వారి ఖాతాల్లో జమ చేసేందుకు బడ్జెట్ మంజూరు కావాలా అంటూ ప్రశ్నించింది. ఉద్యోగుల అకౌంట్ల నుంచి దాదాపు రూ.2,200 కోట్ల వరకు ఉపసంహరించారని..వేరే అవసరాల కోసం వాటిని వినియోగించి, అవసరం తీరాక ప్రస్తుతం తిరిగి వాటిని జమచేస్తామని చెబుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణను తప్పించుకునేందుకు సాంకేతిక కారణాలను తెరపైకి తెస్తున్నారా అంటూ తీవ్రంగా స్పందించింది. కోర్టు పర్యవేక్షణలో ప్రభుత్వ అకౌంట్లను స్వతంత్ర ఛార్టర్డ్ అకౌంటెంట్తో ఆడిట్ చేయించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని వ్యాఖ్యానించింది. ఎప్పటికి సొమ్ము తిరిగి జమ చేస్తారో అఫిడవిట్ ద్వారా చెప్పాలని.. ఒకవేళ వివరాలకు భిన్నంగా వ్యవహరిస్తే సీఎస్ పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంది. విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది హైకోర్టు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa