ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపు ఎక్కువగా కలిపి..తినిపించారు..ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 02:36 PM

ఫ్రొఫెషనల్ కాలేజీలో  ర్యాగింగ్ చూసివుంటాం. ఇపుడు పాఠశాల స్థాయిలో కూడా చూడాల్సివస్తోంది. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు తమ జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఆరుగురు 9వ తరగతి విద్యార్థులతో బలవంతంగా అధిక మోతాదులో ఉప్పు కలిపిన ఆహారాన్ని తినిపించారు. దీంతో ఆ ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. పాడేరు మండలం తలరసింగిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. తమ కంటే చిన్నవారైన అరుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులను టార్గెట్ చేశారు. ఈ ఆరుగురు విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో లీడర్‌షిప్ చేస్తున్నారనే కోపంతో వారిపై పదో తరగతి విద్యార్థులు ‘ఉప్పు’ ప్రయోగించారు. ఆరుగురు విద్యార్థులు తినే అన్నం, కూరలో అధిక మోతాదులో ఉప్పును కలిపి భయపెట్టి మరీ తినిపించారు. దీంతో ఆ ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్కూల్ వార్డెన్ ఆ ఆరుగురిని పాడేరులో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.


విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు. దీనిపై జిల్లా అధికారులు కచ్చితంగా స్పందించాలని. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈశ్వరి డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa