రాజమండ్రి రూరల్ రాజమండ్రి గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల నేతృత్వంలో హుకుంపేట రామకృష్ణ నగర్,సావిత్రి నగర్ లో ప్రాంతాల్లో ఇంకా గోరంట్ల ప్రజా సేవా కొనసాగుతోంది. వరద ముంపుతో బాధపడుతున్న కాలనీవాసులకు గత రెండు రోజుల నుండి ప్రతి ఇంటింటికి ఉచిత మంచినీటి సౌకర్యంని అందిస్తున్నారు. నేడు ఉదయం సావిత్రి నగర్, రామకృష్ణ నగర్ లో ప్రతి ఒక్కరికి గోరంట్ల టీమ్ ఉచిత మంచినీటి క్యాన్లు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే కాలనీ వాసులకి ఉచిత ట్రాక్టర్ సౌకర్యం, మరియు క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం కూడా జరిగింది. దీనిపై డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల స్పందిస్తూ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి విపత్తులోనైన గోరంట్ల ప్రజా సేవ ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతం వరద ప్రదేశాల్లో క్రిమి సంహరిక మందు ని పిచికారీ చేయించడం అయిన మంచి నీళ్ళు సరఫరా అయిన నిత్యావసర సరుకులు పంపిణీ.అయిన గోరంట్ల సేవలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయి అని ఆయన తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa