కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రీకాషనరీ డోస్ వాక్సినేషన్ వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్థానిక మాచవరం 2వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ హాజరు పరిశీలించారు. నగరపాలక సంస్థ కమీషనర్ చంద్రయ్య గారు కలెక్టర్ వెంట ఉన్నారు. వర్షాలు, వరదల వలన ప్రజలకి అంటు రోజాలు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్ కాబట్టి, సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa