ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేంద్ర బంగారం షాప్ లో చోరీ కేసుని సాధించిన విజయవాడ పోలీస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 03:25 PM

ది.15.07.2022 న ఉదయం విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజగోపాలచారి స్ట్రీట్ లోని మహేంద్ర బంగారం షాప్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాప్ గేటు తాళాలు పగలగొట్టి షాప్ లో వున్నా బంగారు నగలను దొంగిలించినట్లు వచ్చిన సమాచారం మేరకు నగర పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్.అదేశాల మేరకు డిప్యూటి పోలీస్ కమీషనర్ విశాల్ గున్ని ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీమతి పి.వెంకటరత్నం ,సి.సి.యస్ ఎ.సి.పి. సి.హెచ్ శ్రీనివాసరావు మరియు సౌత్ డివిజన్ ఏ.సి.పి. డా.బి. రవి కిరణ్ ఆధ్వర్యంలో సి.సి.ఎస్.ఇనస్పెక్టర్లు ఎమ్.రామ్ కుమార్, ఎన్. చలపతిరావు, పి. కృష్ణ మరియు గవర్నర్ పేట ఇనస్పెక్టర్ డి.సురేష్ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి వివిధ కోణాలలో దర్యాప్తును ప్రారంభించినారు. ఈ దర్యాప్తులో బాగంగా సంఘటనా స్థలం మరియు పరిసర ప్రాంతాలలో సి.సి.టి.వి. నిడివిలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనుమానితుల కదలికలపై నిఘా ఉంచడం జరిగింది. ఈ క్రమంలో అనుమానితుడైన సదరు వ్యక్తి ది.26.07.2022 న విజయవాడ, వన్ టౌన్, శివాలయం సమీపంలో తిరుగుతున్నాడని రాబడిన సమచారం మేరకు సి.సి.ఎస్ ఇన స్పెక్టర్ పి. కృష్ణ వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని అదుపులోనికి తీసుకుని విచారించి అతని వద్ద నుండి చోరీకాబడిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు  ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం రాజీవ్ నగర్ కి చెందిన షేక్ హుస్సేన్ బాషా (31 సం) గా గుర్తించడం జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa