ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్దుల్ కలాం చెప్పిన మానవత్వపు కథ

national |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 05:25 PM

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్దంతి నేడు. ఆయన వర్దంతి సందర్బంగా ఆయన చెప్పిన ఓ కథను స్మరించుకుందాం. ఆయన ఏం చెప్పారంటే.. “ ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్లారు. గుడిలో ఉన్న స్థంభాల పై చెక్కిన సింహం బొమ్మలను చూసి కొడుకు నాన్న పరిగెత్తూ లేకుంటే ఆ సింహాలు మనల్ని చంపేస్తాయి అని అన్నాడు. దీంతో ఆ తండ్రి అవి శిల్పాలు మాత్రమే మనల్ని ఏం చేయవన్నాడు. దీంతో కొడుకు మరి అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఏం చేస్తాడు నాన్నా అని అన్నాడు. 


ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. వాడు అడిగిన ప్రశ్నకు నేటికి కూడా నా వద్ద సమాధానం లేదు. దీంతో అప్పటి నుంచి నేను దేవున్ని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో చూడడం ప్రారంభించాను. దేవుడు కనిపించ లేదు కానీ మానవత్వం కనిపించింది అని.” మానవత్వం గురించి అబ్దుల్ కలాం చాలా చక్కగా కథను చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa