అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా స్థానిక శాసన సభ్యులు అన్నంరెడ్డి ఆదీప్ రాజ్ తవ్వవాని పాలెం , అమృతపురం గ్రామాలలోనిఅంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయా కేంద్రాల్లోని అంగన్వాడీ కేంద్రాల పనితీరును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లోని గర్భిణీలకు సామూహిక సీమాంతాలు జరిపారు. అలాగే చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
మంత్రి ఉషశ్రీని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బోకం స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలనుంచి మేలయిన సేవాలందించడమే కాకుండా పిల్లలు విద్యాభ్యాసాల విషయం లో కూడా అనేక పదకాలు ప్రవేశపెట్టారన్నారు. అంతకుముందు అనకాపల్లి జాయంట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ సేవలు అభినందనీయమన్నారు.
సబ్బవరం ఎంపీపీ బో కం. సూర్యకుమారి రామానాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుమ్మపాల అప్పారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్. నారాయణమూర్తి, కొ టా న. రాము, పా లిసెట్టి. సురేష్ రాజు, సర్పంచ్ బో కం. స్వామి నాయుడు, సింగం పలి. శ్రీనివాస్, వి. అప్పలరాజు, మండల. లక్ష్మణ రావు, కాసు బాబు, బైలు పూడి. రామారావులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యే అదీ ప్ రాజ్ లను ఘనంగా సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa