ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైవ్ షోలో విరిగిపడ్డ ఎల్‌ఈడీ స్క్రీన్...షో నిలిపివేత

international |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:31 PM

లైవ్ షోలో ప్రదర్శన సాగుతుండగా ఒక్కసారిగా ఎల్‌ఈడీ స్క్రీన్ షో ప్రదర్శిస్తున్న వారిపై పడింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హాంకాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది. స్టేజ్‌పై ఓ లైవ్ షో జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఇటీవల షోలలో అందరికి క్లియర్‌గా కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అలా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీనే ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. ఒక స్టేడియంలో గురువారం సాయంత్రం మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. అయితే స్టేజ్‌పై డ్యాన్సర్లు ప్రదర్శన ఇస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ డ్యాన్సర్లపై ఎగిరిపడింది. డైరక్టుగా ఒక డ్యాన్సర్‌పై పడింది. ఈ ఘటన జరిగిన వెంటనే షోని వెంటనే నిలిపివేసి, ప్రేక్షకులను వేదిక నుంచి వెళ్లిపోవాలని కోరారు.


ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి తలకు గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. మరొకరి మెడకు గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. నిజానికి జూలై 25న ప్రారంభమైన ఈ షో ఆగస్టు 5 వరకు సాగాల్సి ఉంది. మొత్తం 12 షోలు జరగాల్సి ఉంది.


ఈ అనుకోని ఘటనతో షోను నిలిపివేయడమే కాకుండా భద్రతా కారణాల రీత్యా దృష్ట్యా స్టేడియంలో ఎలాంటి షోలు నిర్వహించకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ మిర్రర్ పాప్ బ్యాండ్ ఇస్తున్న కాంటోనీస్ పాప్ సంగీతం ప్రదర్శన.. చైనీస్ భాషలో ఉంటుంది. 1970 నుంచి హాంకాంగ్‌లో ఈ సంగీతం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే 2000లలో ఈ మ్యూజిక్‌పై అందరిలో ఆసక్తి తగ్గింది. ఆ ఆసక్తిని మళ్లీ పెంచేందుకు మిర్రర్ పాప్ బ్యాండ్ ప్రయత్నిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa