ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా నీయులు పుట్టిన గడ్డపై విష వ్యాపారమా: రాహ‍ుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:41 PM

మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు పుట్టిన గడ్డపై ఈ విష వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరూ అని గుజరాత్ లోని బీజేపీ సర్కార్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వీరిని కాపాడుతున్న రాజకీయ శక్తులు ఎవరని అడిగారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలావుంటే గుజరాత్ లోని బోటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఈ నెల 25న కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోయారు. మరో 97 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ లో అక్రమ మద్యం, డ్రగ్స్ మాఫియా దందాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాఫియాలను అధికారంలో ఉన్న ఏ శక్తులు రక్షిస్తున్నాయని ప్రశ్నించారు. అక్రమ మద్యం వల్ల గుజరాత్ లో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు. బిలియన్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa