ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ రాజకీయవేడి మొదలైంది. పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో విజయం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించగా.. టీడీపీ కూడా రెండో చోట్ల టీడీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. దక్షిణ కోస్తా నియోజకవర్గానికి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల శ్రీకాంత్ను ఎంపిక చేశారు. రాయలసీమ ప్రాంత నియోజకవర్గానికి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన రాంగోపాల్రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. ఇక మిగిలిన ఉత్తరాంధ్ర స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ అభ్యర్థిత్వం కోసం విశాఖకు చెందిన పట్టాభి, సమైక్యాంధ్ర జేఏసీలో పనిచేసిన కిషోర్, ఉద్యోగ సంఘం నేత ఈర్ల శ్రీరాంమూర్తి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. వీరిలో కంచర్ల శ్రీకాంత్ ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు.
మరోవైపు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఉమ్మడి విశాఖ - విజయనగరం - శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఎస్.సుధాకర్ పేరును ఖరారు చేశారు. ఉమ్మడి ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన శాంప్రసాద్ రెడ్డిని బరిలోకి దింపబోతున్నారు. కర్నూలు - కడప - అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూస రవి పోటీలో నిలవనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa