ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారపల్లిలో...రింగు వలల వివాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:59 PM

మత్స్యకారపల్లిలో మరోమారు రింగు వలల వివాదం మంట రాజేసుకొంది. విశాఖలో మత్స్యకారపల్లిలో కొందరు రింగ్ వలలతో చేపల వేటకు వెళ్లగా.. దీనికి సమీపంలో ఉన్న జాలరిపేట గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయ-రింగు వలల మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు. లంగరు వేసిన 6 తెప్పలు, వలలను సంప్రదాయ మత్స్యకారులు తగులబెట్టారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్యవహారం నడుస్తోంది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రెండు గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగ కుండా అడ్డుకున్నారు.


ముందస్తు జాగ్రత్తగా జాలరి ఎండాడ,పెదజాలరిపేటలో భారీగా పోలీసుల్ని మోహరించారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాసవానిపాలెంలో రింగు వలల మత్స్యకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ వలలకు దారుణంగా నిప్పు పెట్టి నష్టపరిచారని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం కూడా రింగు వలల విషయంలో వివాదం రేగడంతో మంత్రి అప్పలరాజు, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa