ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలు ప్రజలకి మేలు చేసే విధంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 12:27 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన చేసారు. చంద్రబాబుని చూసేందుకు తండోపతండాలుగా ప్రజలు కదలివచ్చారు. ఆయన మాట్లాడుతుంటే చేతులెత్తి నమస్కరించారు. ఆయన పలకరిస్తే ఆ ఆప్యాయతకు నిలువెల్లా పులకరించారు. ప్రజలు కష్టాల్లో ఉంటె సీఎం జగన్ పట్టించుకోకుండా, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండి పడ్డారు.  రాజకీయాలు ప్రజలకి మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజలని కష్టాల్లోకి నెట్టే విధంగా ఉండకూడదు అని హితవు పలికారు. నష్టపోయిన కుటుంబాలకి 10000 రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa