చిత్తూరు జిల్లా నందు చిత్తూరు తాలూకా పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 20 లక్షలు రూపాయలు విలువ చేసే 25 ఎర్రచందనము దుంగలు మరియు 10 లక్షలు రూపాయలు విలువ చేసే MAHINDRA XYLO కారు స్వాదినము మరియు ముగ్గురు వ్యక్తులు అరెస్టు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనము అక్రమ రవాణా పైన చిత్తూరు జిల్లా ఎస్.పి శ్రీ Y.8శాంత్ రెడ్డి, ఐపిఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు DSP శ్రీ యన్ సుధాకర్ రెడ్డి కి రాబడిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.బాలయ్య మరియు చిత్తూరు తాలుకా సబ్-ఇన్స్పెక్టర్ V.రామ్ క్రిష్ణ మరియు సిబ్బందితో కలసి 29.07.2022 వతేది మధ్యాహ్నం 1.00 PM గంటలకు తిరుపతి-బెంగళూరు బైపాస్ రోడ్డులో చెర్లోపల్లి మలుపు వద్ద వాహనములను తనిఖీ చేయుచుండగా తిరుపతి వైపు నుండి బెంగళూరు వైపుగా వస్తున్న ఒక MAHINDRA XYLO కారులో ఎర్రచందనము అక్రమ రవాణా గుర్తించి అందులో ఉన్న డైవరు (D.యువ ప్రకాష్), ఇద్దరు కూలిలను (K.సచిన్ మరియు ఎ.వడివేలు) అదుపులోకి తీసుకోని పట్టుబడిన వారిని విచారించగా వారు మేసి కాతు యొక్క ఆదేశాలు మేరకు శేషాచలము అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనము చెట్లను నరికి వాటిని దుంగలుగా చేసి బెంగళూరులోని అబ్దుల్లా అను వ్యక్తికి భారీ ఎత్తున రవాణ చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నట్లుగా తెలిసింది.
అంతటా వారి వద్ద నుండి సుమారు 20 లక్షలు రూపాయలు విలువ చేసే 25 ఎర్రచందనము దుంగలు మరియు అక్రమ రవాణాకు ఉపయోగించిన 10 లక్షలు రూపాయలు విలువ చేసే MAHINDRA XYLO తోపాటు రెండు మచ్చు కత్తులు మరియు ఐదు ఇనుప రాడ్డులను స్వాదినము చేసుకోవడమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa