ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలిక...సుధీర్ఘంగా శ్రమించి కాపాడిన అధికార్లు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 05:08 PM

మనదేశంలో నిత్యం బోరుబావి గుంతలో పడి ప్రాణాలను పోగొట్టుకొంటున్న ఘటనలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. గుజరాత్‌లో సురేంద్ర నగర్ జిల్లా గజన్వావ్ గ్రామంలో తవ్వి ఉంచిన ఓ బోరుబావిలోకి 12 ఏళ్ల బాలిక పడిపోయింది. అయితే భారత ఆర్మీ బృందం కొన్ని గంటలపాటు శ్రమించి ఆ పాప ప్రాణాలను కాపాడింది. అనంతరం ఆమెని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధ్రంగధ్ర తాలుకాలోని గంజన్వావ్‌లో 600 నుంచి 700 అడుగులు ఉన్న బోర్‌వెల్లోకి మనీషా అనే బాలిక ప్రమాద వశాత్తు పడిపోయింది. అలా పడిపోయిన అమ్మాయి 60 అడుగుల వద్ద బాలిక చిక్కుకుపోయింది. సుమారు ఉదయం ఏడున్నర సమయంలో బాలిక పడిపోయింది.


అయితే ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ వెంటనే అధికారులకు తెలియజేశారు. వెంటనే అధికారులు అగ్నిమాపక, వైద్య బృందాలు అక్కడకు చేరుకున్నారు. వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని బోరు బావిలోకి ఆక్సిజన్ను సరఫరా చేశారు. కెమెరాల సాయంతో బాలిక ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అలాగే జిల్లా కలెక్టర్ ధృంగాద్రలో ఉన్న ఆర్మీని ఒక బృందాన్ని నియమించమని అభ్యర్థించగా ఓ ఆర్మీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలిక నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బాలికను రక్షించి.. ఆపై చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు. అక్కడ ఆమెను కొంతకాలం పరిశీలనలో ఉంచుతామని అధికారులు చెప్పారు.


"12 ఏళ్ల మనీషా ఆమె తల్లిదండ్రులు పని చేస్తున్న పొలంలో ఆడుకుంటూ 600 నుంచి 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. గ్రామ సర్పంచ్ వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఒక బృందాన్ని పంపించమని ఆర్మీని కోరారు." అని ధృంగాధ్ర డిప్యూటీ కలెక్టర్ ఎంపీ పటేల్ చెప్పారు. కాగా అదే గ్రామంలో రెండు నెలల క్రితం ఓ బాలుడు కూడా బోరుబావిలో పడిపోగా ఆర్మీ జవాన్లు రక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa