ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో సరికొత్త విధానం అమలు...ఇకా అలా యూనిఫాంలతో వెళ్లితే మాత్రం

national |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 05:07 PM

బుల్డోజర్లు అంటేనే  అందరికీ యూపీ గుర్తుకొస్తుంది. అలాంటి రాష్ట్రంలో విద్యార్థులకు  సంబంధించి సరికొత్త రూల్ అమలులోకి రానున్నది. రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి. పార్క్‌లు, మాల్స్, రెస్టారెంట్స్, జంతు ప్రదర్శన శాలలు వంటి వాటికి ఇక నుంచి స్కూల్ యూనిఫాం ధరించి వెళ్లేందుకు విద్యార్థులకు అవకాశం ఉండకపోవచ్చు. స్కూల్ యూనిఫాం ధరించి విద్యార్థులు వెళ్లడాన్ని నిషేధించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లా మెజిస్ట్రేట్‌లకు లేఖ రాసింది. కొంతమంది విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టి బయట షికారులకు వెళ్లడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు దీనిని పాటించాలని కమిషన్ సభ్యురాలు డాక్టర్ సుచితా చతుర్వేది ఆదేశించారు.


విద్యార్థులు యూనిఫామ్‌లో బయటకు వెళ్తే ఏదైనా జరిగే అవకాశం ఉందని డాక్టర్ చతుర్వేది లేఖలో పేర్కొన్నారు. 18 ఏళ్ల వరకు మైనర్‌లందరి ప్రయోజనాలను పరిరక్షించడం సమాజం సమిష్టి బాధ్యత అని కూడా ఆమె అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ విషయంలో నిశితంగా గమనిస్తోందని, తన వంతు కృషి చేస్తోందన్నారు. అంతేకాదు బాలల రక్షణ, హక్కులకు సంబంధించిన విషయాల్లో తగిన చర్యలు తీసుకునే అధికారం యూపీఎస్సీపీఆర్ కు ఉందిన లేఖలో పేర్కొన్నారు. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన, వారి భద్రతకు భంగం వాటిళ్లితే సుమోటోగా విచారణ చేపట్టే పూర్తి హక్కు కమిషన్‌కు ఉందని పేర్కొంది.


ఈ ఆదేశాలు ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తాయి. ఈ మేరకు ఇకపై పాఠశాలలు, కళాశాలల పని వేళల్లో పాఠశాల యూనిఫాం ధరించినవారు పార్కులు, మాల్స్, సినిమా హాళ్ళు, ఇతర బహిరంగ వెళ్లే ఛాన్స్ ఉండదు. విద్యార్థినీ, విద్యార్థులు తరగతులకు హాజరవడానికి బదులు ఇటువంటి ప్రదేశాల్లో గడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని సుచితా చతుర్వేది అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa