అంతర్జాతీయంగా ఓ అంశం తీవ్ర చర్చాంశనీయంగా మారుతోంది. అల్ఖైదా నాయకుడు, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి బ్రిటన్స్ ప్రిన్స్ చార్లెస్కు విరాళాలు అందినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఒక మిలియన్ పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో రూ.9.6 కోట్లు విరాళం తీసుకున్నారని ది సండే టైమ్స్ తెలియజేసింది. ఈ మొత్తం డబ్బు ప్రిన్స్ చార్లెస్ స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్లో జమ అయింది. ది సండే టైమ్స్ కథనం ప్రకారం ప్రిన్స్ చార్లెస్ ప్రిన్స్ చార్లెస్ లండన్లో ఆల్ ఖైదా వ్యవస్థాపకుడి సవతి సోదరుడు బకర్ బిన్ లాడెన్, షఫీక్లతో సమావేశమయ్యారు. 2013లో ఒక మిలియన్ పౌండ్లు తీసుకోవడానికి అంగీకరించారు. బిన్ లాడెన్ సోదరుల నుంచి ఫండ్స్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే ట్రస్ట్ సలహాదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రిన్స్ ఆ ఫండ్స్ తీసుకున్నారని వార్తలో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ట్రస్టులో ఐదుగురు సభ్యులు విరాళం తీసుకునేందుకు అంగీకారం తెలిపారని పీడబ్ల్యూసీఎఫ్ చైర్మన్ ఇయాన్ చెషైర్ వెల్లడించారు. అయితే వారెందుకు ఈ డబ్బును తీసుకున్నారనే విషయం తెలియలేదు. వారేమైనా నేరాల్లో పాల్గొన్నారా..? అనేది ఇప్పుడు హాట్టాపిక్గ మారింది. కానీ ఇప్పటికే ప్రిన్స్ చార్లెస్ చారిటబుల్ ట్రస్ట్లపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సౌదీ వ్యాపారవేత్తతో క్యాష్ ఫర్ ఆనర్స్ కుంభకోణం ఆరోపణలపై ప్రిన్స్ చార్లెస్కు చెందిన మరో చారిటబుల్ ట్రస్ట్పై బ్రిటిష్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దర్యాప్తు ప్రారంభించారు. అంతర్గత విచారణ జరిగిన తర్వాత ప్రిన్స్ పౌండేషన్ ముఖ్య అధికారి గతేడాదే రాజీనామా కూడా చేశారు. కాగా ఒసామా బిన్ లాడెన్ పెద్ద ఉగ్రవాది. 2001 సెప్టెంబరు 11న అమెరికాలో దాదాపు మూడు వేల మందిని బలిగొన్న ఉగ్రవాద దాడులకు ఒసామా బిన్ లాడెన్ సూత్రధారి. ఒసామా బిన్ లాడెన్ను పాకిస్థాన్లో అమెరికా ప్రత్యేక బలగాలు హతర్చారు. బిన్ లాడెన్ చనిపోయిన రెండేళ్ల తర్వాత సౌదీ సంపన్న కుటుంబానికి చెందిన బాకర్తో చార్లెస్ సమావేశం జరిగిందని ది సండే టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. కాగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ 1979లో స్థాపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa