మరోమారు కార్టూన్ రూపంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ను మళ్లీ టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఓ కార్టూన్తో ఆసక్తికర ట్వీట్ చేశారు. గతవారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్య నిషేధంపై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకూ ఏపీలోని రోడ్ల దుస్థితిని కార్టూన్లు ట్వీట్ చేసిన ఆయన.. తాజాగా మద్య నిషేధంపై ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ‘వంద కోట్లు పోయాయని మేం ఏడుస్తుంటే మధ్యలో మద్య నిషేధం, మద్య నిషేధం అంటూ నీ గోలేందమ్మా’ అంటూ కార్టూన్ను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. కింద బార్ యజమానులు సిండికేట్ కావడం వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్లు నష్టం అంటూ కార్టూన్లో ప్రస్తావించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్యనిషేధంపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా దుమారం రేగింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధం అనే పదమే లేదని.. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాము పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పలేదని.. మద్యం ధరలను ఫైవ్ స్టార్ హోటళ్ల స్థాయికి పెంచుతామని.. మందుబాబులకు షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు.. వెళ్లి చూసుకోవచ్చని చెబుతున్నారు. ఈ కామెంట్స్ తర్వాతే పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa