భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ది. 13. 08. 2022 శనివారం ఉదయం జెఎన్ టియుకె మెయిన్ గేట్ వద్ద ఉపకులపతిప్రొ. జివిఆర్. ప్రసాదరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. జెఎన్ఎయుకె ఎన్ఎస్ఎస్ కో - ఆర్డినేటర్ డా. జి. శ్యామ్కుమార్ అధ్యక్షతన జరిగినఈకార్యక్రమానికిఉపకులపతిప్రొ. జివిఆర్. ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా విచ్చేయగా గౌరవ అతిథులుగా రెక్టార్ ప్రొ. కెవి. రమణ , రిజిస్ట్రార్ ప్రొ. ఎల్. సుమలత , యుసిఇకె ప్రిన్సిపాల్ ప్రొ. ఎం. హెచ్. ఎం. కృష్ణప్రసాద్లు విచ్చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొ. జివిఆర్. ప్రసాదరాజు మాట్లాడుతూ చిన్నారుల నుండి పెద్దల వరకు ప్రతీ ఒక్కరు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యూనివర్శిటీ ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నామన్నారు. అదేవిధంగా జెఎన్టియుకె పరిపాలనా భవనం వద్ద ఉపకులపతి ప్రొ. జివిఆర్. ప్రసాదరాజు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జెఎన్టియుకె యూనివర్శిటీ మరియు యుసిఐకెలోని అన్ని విభాగాలలో బోధన , బోధనేతర సిబ్బంది , విద్యార్థులు జాతీయ జెండాను ఎగురవేయాలని , జెండాను ఎగురవేసినపుడు ఫోటో తీయించుకుని దానిని https: //harghartiranga. com వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసినదిగా ఎన్ఎస్ఎస్ కో - ఆర్డినేటర్ డా. జి. శ్యామ్కుమార్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa