3940 అక్రమ మద్యం సీసాలు సుమారు రూ. 6,00,000 /- విలువైన అక్రమ మద్యం ధ్వంసం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP శ్రీ కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డి, ఐపిఎస్., వారి దిశా నిర్దేశాల ప్రకారం మరియు శ్రీ ఎ. రవిశంకర్, ఐపిఎస్., కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పరిధిలో ఈ క్రింద పేర్కొన్న పోలీస్ స్టేషన్ లు మరియు SEB స్టేషన్ ల నందు వివిధ కేసులలో స్వాదీనపరుచుకున్న నాటుసారా మరియు అక్రమ మద్యం సీసాలను కాకినాడ జిల్లా SP శ్రీ ఎం.రవీంద్రనాధ్ బాబు, ఐపిఎస్., గారి ఆద్వర్యంలో Addl. SP అడ్మిన్ & డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, కాకినాడ జిల్లా శ్రీ పి.శ్రీనివాస్ మరియు అసిస్టెంట్ కమీషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ యం.జయరాజు వారి సమక్షంలో లీగల్ ప్రొసీజర్ పూర్తి అయిన తర్వాత ధ్వంసం చేయడమైనది.
కాకినాడ జిల్లా SP గారు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పైన తెలిపిన 2,926 కేసులకు సంబంధించిన 59,546 లీటర్ల నాటుసారా, 275 కేసులకు సంబంధించిన 3940 అక్రమ మద్యం సీసాలను శ్రీ Ch.అజయ్ కుమార్ సింగ్,ఇంచార్జ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్,కాకినాడ SEB అధికారులు,పోలీస్ అధికారులు & మద్యవర్తుల సమక్షంలో సిబ్బంది సహాయంతో ధ్వంసం చేయడమైనది.ఈ కార్యక్రమం కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలో నిర్వహించమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa