కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యకు సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపిన కేసులో కర్ణాటక పోలీసులు కీలక ముందడుగు వేశారు. నటుడు దర్శన్ అభిమానులుగా గుర్తించిన 12 మందిపై గురువారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టుకు 380 పేజీల భారీ ఛార్జ్షీట్ను సమర్పించారు.నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని రమ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన దర్శన్ అభిమానులు ఆమెను లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. కొందరైతే అత్యాచారం చేస్తామంటూ తీవ్రంగా బెదిరించారు. ఈ ఘటనపై రమ్య జులై 28న బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్కు ఫిర్యాదు చేశారు. తనను వేధిస్తున్న 43 సోషల్ మీడియా ఖాతాల వివరాలను పోలీసులకు అందించారు.ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. నిందితులంతా దర్శన్ అభిమానులేనని విచారణలో తేలింది. ఛార్జ్షీట్లో రమ్య వాంగ్మూలంతో పాటు నిందితులు అంగీకరించిన నేర వివరాలను, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల స్క్రీన్షాట్లను పోలీసులు జతపరిచారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు ప్రస్తుతం జైల్లో ఉండగా, మిగతా వారు బెయిల్పై విడుదలయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa