విదేశీ చిత్రాల కోటాలో భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ రేసుకు ఎంపికైన తెలుగు చిత్రం డియర్ కామ్రేడ్ చివరకి రేసు నుంచి నిష్కృమించినట్టు తెలియవచ్చింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు భారత్ నుంచి హిందీ, తమిళం, తెలుగు తదితర భాషలలో 28 సినిమాలు నిలవగా రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన గల్లీబాయ్ చిత్రం మాత్రమే భారతదేశం తరుపున నామినేట్ అయ్యింది.
భరత్ కమ్మ దర్శకత్వం లో వచ్చిన డియర్ కామ్రేడ్ మహిళా సమస్యలను చాల సున్నితంగా చూపెట్టిన విధానంతో భారత ఆస్కార్ ప్రాబబుల్స్ లో చోటు సంపాదించింది. అటు .తమిళం నుంచి వడచెన్నై,సూపర్డీలక్స్ చిత్రాలు కూడా పోటీ పడ్డా చివరకి ఆస్కార్ కు మాత్రం నామినేట్ కాలేకపోయాడు కామ్రేడ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa