నటిగా తనకు కలసి రాక పోవటంతో నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తండ్రి నాగబాబు బాటలో పయనిస్తున్నారు. ఇప్పటికే మ్యాడ్ హౌస్ వెబ్ సిరీస్ ఆరంభించిన ఆమె ఇందుకు సంబంధించి ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. మ్యాపర్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సిరీస్కు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రోమో విడుదల చేసిన అనంతరం నీహారిక మాట్లాడుతూ మనం నిత్యంవ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. వాటిని యువత ఎలా అధిగమిస్తున్నారనే కాన్సెప్ట్తో రూపొందిన వెబ్ సిరీస్ ఇది. గతంలో నేను చేసిన ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి తరహాలోనే ఈ సిరిస్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుదని నమ్ముతున్నా అని అన్నారు. అదే తరహాలో ఈ సీరిస్ కూడా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందదని చెప్పారు. ప్రధానంగా యువతని ఆకర్షించేలా సాగే ఈ సీరిస్ యు ట్యూబ్ వేదికగా 100 ఎపిసోడ్స్ ప్లాన్ చేసాం. ప్రతివారం ఒక ఎపిసోడ్ విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మహేశ్ ఉప్పల్, సహనిర్మాత (ఇన్ఫినిటమ్ సంస్థ) వందన, మ్యాపర్ యాప్ సీఈవో శుభకర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa