ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూస ధోరణికి చెక్ పెడుతూ సాగిన థమన్ సంగీతం

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 09:15 PM

ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠ పురంలో’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి. ఇక తాజాగా ఈ సినిమాలోని తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  వీడియోలో తమన్ పియానో వాయిస్తుండగా శ్రీరామ్ పాట ఆలపిస్తూ కనిపించారు. ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు.. నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు’ అంటూ సాగుతున్న ఈ పాటలోని లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో థమన్ సంగీతం మూస ధోరణిలో సాగుతుందని వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తమన్ తన శైలికి భిన్నంగా అందించిన స్లో మ్యూజిక్ చాలా బాగా ఉంది.  ఇక పాటకు సిద్ శ్రీరామ్ వాయిస్ ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa