కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్న లెజెండరీ నటుడు మోహన్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీ.వి. ఆనంద్ బోస్ చేతుల మీదుగా 'గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు'ను ఆయన అందుకున్నారు. తెలుగు నటుడికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.కోల్కతాలోని లోక్ భవన్లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ బాబు ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం జరిగిన 'ఎట్ హోం' రిసెప్షన్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa