ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్లారిటీ ఇచ్చినా.. తప్పని పుకార్లు..!

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 05:20 PM

"ఛలో" సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన. ఈ భామ రెమ్యూనరేషన్ పై పుకార్లు గత కొంత కాలంగా చికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ అదే రూమర్ షికారు చేస్తోంది. ఇటీవల చైతూ జోడీగా చేయమని అడిగితే, ఆయనకంటే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ప్రచారం జోరందుకుంది. 'మజిలీ' తరువాత చైతూ ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. పూజా హెగ్డే వంటి హీరోయిన్ కే అందులో సగం ఇస్తున్నారు. అందువలన చైతూ కంటే ఎక్కువ పారితోషికాన్ని రష్మిక అడిగే అవకాశం లేదనీ, ఇదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమనేది సన్నిహితుల మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa