ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెలబ్రిటీలు బయటకు వచ్చి మాట్లాడటానికి ధైర్యం చేయడం లేదు!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2019, 07:44 AM

మల్లెమాల ప్రొడక్షన్స్ హౌస్‌ బుల్లితెరపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సంస్థకు చెందిన జబర్దస్త్ కామెడీ షో, పటాస్ షోలో చోటుచేసుకునే పరిణామాలే నిదర్శనం. మొన్న జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు క్విట్, పటాస్ షో నుండి యాంకర్ రవి క్విట్ అవుతూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. జబర్దస్త్‌లో నాగబాబు ఏడేళ్లు పాటు పనిచేస్తే.. పటాస్‌లో యాంకర్ రవి నాలుగేళ్లు పాటు యాంకరింగ్ చేశారు. అయితే ఈ రెండు షోలు మల్లెమాల ప్రొడక్షన్స్ హౌస్‌కి చెందినవే కావడంతో ఇలా ఒక్కొక్కరూ ఎందుకు బయటకు వచ్చేస్తున్నారన్న చర్చ బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సందర్భంలో తాను ‘పటాస్’ నుండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు యాంకర్ రవి. ఆయన మాట్లాడుతూ..... 
"నాలుగేళ్లు పటాస్ షో కోసం మామూలు కష్టం పడలేదు. అన్నేళ్ల పాటు చేయడం పటాస్ షోలో చేసి బయటకు రావడం బాధగానే ఉంది. 80 షెడ్యూల్డ్స్.. ఒక్కో షెడ్యూల్డ్‌కి నాలుగు రోజుల షూటింగ్.. రోజుకి నాలుగు ఎపిసోడ్‌లు ఇలా 80 షెడ్యూల్డ్స్ చేసి 1220 ఎపిసోడ్‌లు చేశాం. ఒక షోలో 1200 ఎపిసోడ్‌లు చేయడం అంటే చిన్న విషయం కాదు. నాలుగు సంవత్సరాల పాటు కష్టపడ్డాం. ఒక్కరోజు షూటింగ్ ఉంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ పడిన కష్టానికి చెమట కాదు రక్తం కారేది. ప్రతిరోజు కష్టపడాలి.. అదే సందర్భంలో కొత్తగా చేయాలనే తపన ఉండేది. నేను ఈ షో నుండి బయటకు వచ్చేయడంతో బయట చాలా రకాల ప్రచారాలు నడుస్తున్నాయి. మేం సముద్రం లోపల ఉన్నాం.. జనాలు సముద్రం బయట నుండి చూస్తుంటారు. A-Z వరకూ ఏదైనా విషయం జరిగింది అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిని మేం చెబితే.. బయట వాళ్లు ఇండస్ట్రీ వాళ్లు కూడా రెండు రకాలుగా తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతున్నాం. ఈరోజుల్లో సెలబ్రిటీలో బయటకు వచ్చి మాట్లాడటానికి ధైర్యం చేయడం లేదు. జరిగిన ఇష్యూలో ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే.. ఎలా రియాక్ట్ అవుతారనే భయం. ఆ భయంతోనే సెలబ్రిటీలు బయటకు రావడంలేదు. వాస్తవాలను వదిలేసి వాళ్లకు ఇష్టమైనదాన్ని తీసుకుంటారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు. నేను సంథింగ్ స్పెషల్ అనే కార్యక్రమం నాలుగేళ్లు పాటు చేశా. అది డైలీ ప్రోగ్రామ్. 900 ఎపిసోడ్‌లు పైగా చేశాం. 15 రోజుల పాటు షూట్ చేసేవాళ్లు. ప్రపంచానికి దూరంగా ఉండేవాళ్లం. ఏం తెలిసేది కాదు. సేమ్ పటాస్‌లో కూడా అదే జరిగింది. పటాస్‌లో రాను రాను వర్క్ క్వాంటిటీ పెరిగిపోయింది. క్వాంటిటీ తగ్గించుకుని క్వాలిటీకి వెళ్దామని అనిపించింది. అది ఎలా అంటే.. వారంలో ఒకసారి కనిపించినా ఆడియన్స్‌ని ఎంటర్ టైన్ చేసేలా. ఒక ఇమేజ్ అంటూ ఉండాలి అని అనుకున్నాను. మన ఇండస్ట్రీలో ఇమేజ్ అనేది చాలా అవసరం. ఆ ఇమేజ్‌ని బట్టే విలువ ఇస్తారు. అంతెందుకు పెద్ద హీరోలు సినిమాలు ముందు, ఆడియో ఫంక్షన్లు అప్పుడే కనిపిస్తారు. ఇంటర్వ్యూలకు కూడా రారు. ఎందుకు అంటే జనానికి ఎక్కువగా కనిపిస్తే లోకువ అయిపోతామనే చిన్న ఫీలింగ్. నేను కూడా ఇదే ఆలోచించి.. ప్రతిరోజు కనిపిస్తున్నాం కదా.. కొంచెం ఎక్స్ క్లూజివ్‌గా వారానికి ఒక్క రోజు ఎంటర్ టైన్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే తప్పుకున్నా. నేను పటాస్ నుండి బయటకు వచ్చేయాలని ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు.. ఎప్పటి నుండో చర్చలు నడుస్తున్నాయి. చాలా మంది పటాస్ ఇంతకు ముందులా ఉండటం లేదని.. ఇంకా కొంచెం మార్చండి అనేవారు. మనం ఏం చేయగలం. రవి గాడు ఎంతవరకూ అని పంచ్‌లు వేస్తాడు. మొత్తం పిండేశారు. పటాస్ షోను నిర్వహించే మల్లెమాలకు కొత్త కొత్త షోలను ఇంట్రడ్యూస్ చేయడం.. కొత్త కొత్త కాన్సెప్ట్‌లు తీసుకురావడంతోపాటు ఆ ప్రొడక్షన్ హౌస్‌కి మంచి బలం ఉంది. కాని నేను ఎప్పుడూ ఇదే ఏం చేస్తాం కొత్తగా చేయాలని అనిపించింది. అందుకే దీనికి కొంచెం బ్రేక్ ఇచ్చి హాలీడేస్‌లో కొంచెం గ్యాప్ తీసుకుంటే మళ్లీ ఫ్రెష్‌గా చేస్తానేమో అనిపించింది పటాస్ నుండి బయటకు వచ్చేశా. నేను ఏం చెప్పినా వాళ్లు రాసుకున్నది వాళ్లు రాసుకుంటారు. జరిగింది మాత్రం ఇదే" అంటూ పటాస్ షో నుండి ఎందుకు బయటకు వచ్చాడో క్లారిటీ ఇచ్చాడు రవి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa