ఎప్పుడు ఏదో ఒక షో యాంకరింగ్ చేసుకుంటూ బిజీ లైఫ్ ని లీడ్ చేసే సుమ కనకాల ఈరోజు క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఇచ్చే అవగాహన కార్యక్రమంలో పాల్గొని తన మంచి మనసుని ప్రజలకు చాటి చెప్పారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స దొరుకుతుంద ? అంటే.. దొరుకుతుంది అనే చెప్తున్నారు యాంకర్ సుమ కనకాల.
ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ.. నేను ఈరోజు హనుమకొండ వచ్చాను.. మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్టుకు వచ్చాను. ఇక్కడ రమేష్ గారు ఉన్నారు.. క్యాన్సర్ కు సంబంధించి ఇంకా ఎక్కడ మందులు దొరకవు అనుకున్న సమయంలో,అయిపోయింది అనుకున్న వారిని కూడా వీరి మందులతో బతికిస్తున్నారు.
ఇక్కడ కిషన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాతే ఇక్కడ వైద్య విధానం ఏంటి అనేది అన్ని తెలుసుకొని ఇక్కడకు రావడం జరిగింది. దీనికంటే ముందే ఒక ఎనిమిది నెలల ముందే ఈ చికిత్స గురించి నాకు తెలిసింది ఇలాంటి ఒక వైద్య విధానం ఉంది అని. లివర్ కి సంబంధించిన సమస్య వస్తే.. వారిని అడిగితే, ఆ సమస్యకు కూడా మందులు ఉన్నాయి అని కిషన్ గారు చెప్పడం జరిగింది.
ఇక్కడ వారు చెప్పిన మాటలు విన్నాక నాకు అర్థం అయ్యింది ఏమిటి అంటే.. మార్పు మనలో రావాలి అని నాకు అర్థం అయ్యింది. అలాగే మన జీవనం విధానం పూర్తిగా మార్చేశాము. భూమి పుట్టినప్పటి నుండి వేరే జంతువులు అన్ని కూడా ఎలాగైతే బతుకుతూ ఉన్నాయో, అలాగే బతుకుతున్నాయి ఇప్పుడు కూడా. అంటే.. సాయింత్రం అయ్యాక ఆహారం తీసుకుంటాయి.. పడుకోవాల్సిన సమయంలో పడుకుంటాయి.. కానీ మనిషి మాత్రం వృత్తి రీత్యా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ఒక ఆవు ఉన్నట్టు అయితే 30 ఎకరాల భూమిని పండిచ్చుకోవచ్చు.. ఆరోగ్యం బాగుంటుంది.. ఆవును గోమాత అని పూజించుకున్నది ఎందుకు అంటే.. ఒక ఆవు చేసేటటువంటి మేలు ఒకటే కాదు.. అది మన ఆరోగ్యం బాగుండటం కోసమని అన్ని చేస్తాయి కాబట్టి ఆవులను రక్షించుకుంటూనే మిగితా అన్ని చికిత్సలు చేస్తున్నారు.. అది కూడా నిస్వార్ధంగా చేస్తున్నారు.. మానవతాదృక్పథంతో చేస్తున్నారు... ఎలాంటి ఫీజులు ఆశించకుండా చేస్తున్నారు అని సుమ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa