ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ ల కోసమే కథలు రాస్తా…

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 19, 2019, 03:40 PM

భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందారు కేఎస్‌ రవికుమార్‌. దక్షిణాదిలో కమల్‌, రజినీ, చిరంజీవి లాంటి స్టార్‌లతో సూపర్‌ హిట్‌ చిత్రాలు రూపొందించారీ ప్రతిభాశాలి. బాలకృష్ణతో జైసింహా చిత్రాన్ని తెరకెక్కించిన కేఎస్‌ రవికుమార్‌, రూలర్‌తో మరోసారి శక్తివంతమైన పాత్రలో ఆయన్ను చూపించబోతున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ…జైసింహా చిత్రం చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు నాకు మంచి మిత్రుడయ్యారు. సమయపాలనలో ఇద్దరం పోటీ పడుతుంటాం. ఏకాగ్రతతో అనుకున్న సమాయనికి పనిచేస్తే ఎంత పెద్ద చిత్రమైనా పూర్తిచేయగలం. రూలర్‌ చిత్రానికి మరో కథ రాశాను. అప్పటికి క్లైమాక్స్‌ పూర్తి కాలేదు. ఇంతలో నిర్మాత పిలిచి పరుచూరి మురళి దగ్గర కథ ఉంది వినండి బాగుంది అన్నారు. నాకూ నచ్చి మొదలుపెట్టాం. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ అనే జిల్లాలో ఈ కథ జరుగుతుంది. బాలకృష్ణ గారు రెండు పాత్రల్లో ఒకదాని కోసం బాగా బరువు తగ్గారు. నేను స్టార్‌లకు తగినట్లు కథలు రాస్తుంటాను. అలా బాలకృష్ణ ఇమేజ్‌కు తగినట్లు ఈ సినిమా ఉంటుంది. వేగంగా సినిమాలు చేస్తాననే పేరుంది నాకు. ఇది నేను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పటి నుంచే తెలుసుకున్నా. ఎందుకు సినిమాలు ఆలస్యమవుతున్నాయో పరిశీలించాను. అవి నా చిత్రాలకు కాకుండా చూసుకుంటా. ఇంతకుమించి రహస్యమేమీ లేదు. చిరంజీవి గారితో 45 రోజుల్లో స్నేహం కోసం సినిమాను పూర్తి చేశాను. ఈ చిత్రం పూర్తయ్యాక చిరంజీవి గారు వేదికమీద మాట్లాడుతూ…నా కెరీర్‌లో ఇంత పెద్ద సినిమా ఇంత తక్కువ సమయంలో చేసింది లేదు అని చెప్పారు. ఏకాగ్రత ఒక్కటే విజయానికి ఏకైక రహస్యం. అంతకంటే మరేం లేదు. నేను చిన్న చిత్రాలు చేయలేను. చిన్న చిత్రాలు చేసి ఎదిగి పెద్ద సినిమాలు రూపొందిస్తున్నా. నటుడిగా కొన్ని అవకాశాలు వస్తున్నాయి. రవితేజ హీరోగా చేస్తున్న సినిమాలో ఓ పాత్రకు అడిగారు. అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa